హిజ్బుల్లాకు మరో ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడుల్లో ఆ సంస్థ చీఫ్ కుమార్తె మృతి
- లెబనాన్ రాజధాని బీరుట్పై దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్
- మొన్న హిజ్బుల్లా డ్రోన్ చీఫ్ హుస్సీన్ సురౌర్ హతం
- తాజాగా చీఫ్ నస్రుల్లా కుమార్తె జైనాబ్ మృతి చెందినట్టు కథనాలు
- ధ్రువీకరించని లెబనాన్, హిజ్బుల్లా
జైనాబ్ తొలి నుంచి హిజ్బుల్లాకు గట్టి మద్దతుదారుగా ఉంది. 1997 ఇజ్రాయెల్ దళాల దాడుల్లో సోదరుడు హడీ మృతి చెందినప్పుడు కూడా ఆమె స్పందించారు. జైనాబ్ మృతి కనుక నిజమే అయితే హిజ్బుల్లాకు అది గట్టి ఎదురుదెబ్బే అవుతుంది. కాగా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ నస్రుల్లా కూడా మృతి చెందినట్టు చెబుతున్నారు. తమ దాడుల నుంచి ఆయన తప్పించుకున్నాడంటే నమ్మలేమని ఇజ్రాయెల్ డిఫెన్స్ వర్గాలు చెబుతున్నాయి.