రాముడు వనవాసానికి వెళితే భరతుడిలా బాధ్యతలు చేపట్టా: ఢిల్లీ సీఎం అతిశీ
- ఆ కుర్చీ ఎప్పటికైనా కేజ్రీవాల్ దే అంటూ మాజీ సీఎం కుర్చీని పక్కనే పెట్టుకున్న అతిశీ
- బాధ్యతలు స్వీకరించాక మీడియాతో మాట్లాడిన అతిశీ
- ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ కు మరోసారి పట్టం కడతారన్న కొత్త సీఎం
నాలుగు నెలల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు మరోమారు కేజ్రీవాల్ కు పట్టం కడతారని, ఈ కుర్చీలో మరోమారు ఆయనను కూర్చోబెడతారని తనకు విశ్వాసం ఉందన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రామాయణంలో భరతుడితో తనను తాను పోల్చుకున్నారు. రాముడు వనవాసం వెళితే ఆయన తరఫున ప్రతినిధిగా పాలనా బాధ్యతలను భరతుడు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం తాను కూడా అదేవిధంగా బాధ్యతలు చేపట్టానని వివరించారు. నాలుగు నెలల తర్వాత కేజ్రీవాల్ తిరిగి ఇక్కడికి (సీఎంవోకు) వస్తారని, అప్పటి వరకు పాలన కుంటుపడకుండా తాను చూసుకుంటానని అతిశీ చెప్పుకొచ్చారు.