కృష్ణా పైప్‌లైన్ లీకేజీ కారణంగా హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాకు అంతరాయం

  • కృష్ణా ఫేజ్-1లోని పైప్‌లైన్‌లో భారీ లీకేజీ
  • దేవత్‌పల్లి వద్ద 300 ఎంఎం డయా ఎయిర్ వాల్వ్‌లో లీకేజీ
  • సైదాబాద్, శివంరోడ్డు సహా పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
కృష్ణానది తాగునీటి సరఫరా ఫేజ్-1లోని పైప్‌లైన్‌లో భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఈరోజు అంతరాయం కలుగుతుందని జలమండలి ప్రకటించింది. దేవత్‌పల్లి వద్ద 300 ఎంఎం డయా ఎయిర్ వాల్వ్‌లో ఆకస్మికంగా భారీగా లీకేజీ కనిపించిందని, ఈ కారణంగానే తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు.

లీకేజీ మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఈరోజు మధ్యాహ్నంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ లీకేజీ కారణంగా మిరాలం, కిషన్ బాగ్, సంతోష్ నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, యాకుత్‌పురా, బొగ్గులకుంట, నారాయణగూడ, అడిక్‌మెట్, శివం రోడ్డు, నల్లకుంట, చిలకలగూడ, దిల్‌సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పాక్షిక అంతరాయం కలుగుతుందన్నారు.

Hyderabad
Drinking Water
Krishna Water

More Telugu News