ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో బిగ్ షాక్
- కూల్చివేతలపై స్టే ఇవ్వాలన్న నేహారెడ్డి విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు
- స్టే ఉత్తర్వులు లేనందున అక్రమ నిర్మాణాలను కాల్చివేయవచ్చన్న హైకోర్టు
- జనసేన నేత మూర్తి యాదవ్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ, తదుపరి విచారణ 25కి వాయిదా
విశాఖలో అక్రమ నిర్మాణాలపై జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనంలో బుధవారం మరోసారి విచారణ జరిగింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, జీవీఎంసీ తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) ఎస్ ప్రణతి వాదనలు వినిపించారు.