అలాంటి వాటికి సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు: పోచారం శ్రీనివాస్ రెడ్డి
- వ్యవసాయ శాఖ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన పోచారం
- దేశానికి, రాష్ట్రానికి రైతే వెన్నుముక అన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి
- రైతును బాగా చూసుకుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని వ్యాఖ్య
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ... దేశానికి, రాష్ట్రానికి రైతే వెన్నుముక అన్నారు. రైతుల కష్టాలను తీర్చేలా ప్రభుత్వం, అధికారులు కృషి చేయాలని సూచించారు.
దేశానికి అన్నం పెట్టేవాడు రైతు అని, అలాంటి రైతును బాగా చూసుకుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్న ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో సలహాలు ఇస్తానన్నారు.