దోషిగా తేలినప్పుడు చూద్దాం.. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబల్ హసన్కు లైన్ క్లియర్
- బంగ్లాదేశ్లో ఇటీవల హింసాత్మక ఘటనలు
- అల్లర్లలో మరణించిన యువకుడి తండ్రి నుంచి బీసీబీకి నోటీసులు
- షకీబల్పై నిషేధం విధించాలని డిమాండ్
- ప్రస్తుతం అతడిపై నమోదైనది ఎఫ్ఐఆర్ మాత్రమేనని స్పష్టీకరణ
- భారత పర్యటనకు అతడు అందుబాటులో ఉంటాడన్న బోర్డు
ఇటీవల హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన రూబెల్ తండ్రి రఫీకుల్ ఇస్లాం లాయర్లు బీసీబీకి నోటీసులు పంపారు. షకీబల్పై నిషేధం విధించాలని అందులో డిమాండ్ చేశారు. ఈ నోటీసులపై బీసీబీ స్పందించింది. లీగల్ నోటీసులు అందినమాట వాస్తవమేనని తెలిపింది. ఈ నోటీసుకు తాము సమాధానం ఇచ్చామని, షకీబల్ జట్టులో కొనసాగుతాడని చెప్పినట్టు పేర్కొంది. అతడు దోషిగా తేలేవరకు ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించింది. అతడికి న్యాయపరమైన సాయం అందించేందుకు బోర్డు సిద్ధంగా ఉందని తెలిపింది. సర్రే కౌంటీ క్రికెట్ ఆడేందుకు కూడా అతడికి ఎన్వోసీ ఇచ్చినట్టు పేర్కొంది.