త్వరలో ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: మంత్రి అచ్చెన్నాయుడు
- కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందన్న అచ్చెన్న
- గత ప్రభుత్వం రూ.13 లక్షల కోట్ల అప్పులు చేసిందని వెల్లడి
- ప్రస్తుతం ఆదాయం కనిపించే పరిస్థితి లేదని వివరణ
- అయినప్పటికీ హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టీకరణ
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు వైసీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వం రూ.13 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం ఆదాయం కనిపించే పరిస్థితి లేదని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించారు. అయినప్పటికీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు.