కడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరిన గాయని పి. .. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం

Popular singer P Susheela is unwell
  • చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేరిక
  • వైద్యులు సూచించిన మెడిసిన్‌తో కడుపు నొప్పి తగ్గిపోతుందని వెల్లడి
  • ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన వైద్యులు
లెక్కలేనన్ని పాటలు పాడిన ప్రముఖ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి. సుశీల శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. 86 ఏళ్ల సుశీల కడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హాస్పిటల్ వైద్యులు తెలిపారు.

ఆమెకు ప్రస్తుతం అందిస్తున్న మందులతో కడుపు నొప్పి తగ్గిపోతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా సుశీల త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వాలని సినీ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ప్రస్తుతం 86 ఏళ్ల వయసున్న పి. సుశీల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
Go Back to Shorts
P Susheela
P. Susheela
Movie News
Chennai

More Telugu News