ముగిసిన డెడ్లైన్.. ఐఏఎస్ శిక్షణ కేంద్రానికి పూజా ఖేద్కర్ డుమ్మా
- పలు వివాదాల్లో చిక్కుకున్న ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్
- శిక్షణ నిలిపివేసి 23న ముస్సోరీ శిక్షణ కేంద్రంలో రిపోర్టు చేయాలని ఆదేశం
- నకిలీ ధ్రువీకరణ పత్రాలపై కేసు నమోదు చేసిన ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు
- ధ్రువపత్రాలు పరిశీలించేందుకు ఏక సభ్య కమిషన్ను ఏర్పాటు చేసిన కేంద్రం
నకిలీ డిజేబులిటీ, కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమె సెలక్షన్ చుట్టూ వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ట్రైనింగ్ను నిలిపివేసిన ప్రభుత్వం ఈ నెల 23న ముస్సోరి శిక్షణ కేంద్రంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ ఆమె ఆ ఆదేశాలను పట్టించుకోలేదు.
మరోవైపు, తన గుర్తింపునకు సంబంధించి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెపై ఢిల్లీ పోలీస్ క్రైంబ్రాంచ్ కేసు నమోదు చేసింది. ఖేద్కర్ సమర్పించిన డాక్యుమెంట్ల పరిశీలన కోసం కేంద్రం ఏకసభ్య కమిటీని నియమించింది.