చంద్రబాబు లేఖపై స్పందించిన రేవంత్ రెడ్డి
- ఏపీ సీఎంకు ప్రత్యుత్తరం రాసిన తెలంగాణ సీఎం
- సమస్యలను పరిష్కరించుకుందామన్న మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని వెల్లడి
- మహాత్మా జ్యోతిరావు పూలే భవనంలో కలుద్దామన్న తెలంగాణ సీఎం
- ఏపీలో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున మిమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవనంలో కలుద్దామని తెలిపారు.
నిన్న మీరు పంపిన లేఖ అందిందని... దానిని చదివానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొదటగా ఏపీలో విజయం సాధించినందుకు కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర భారతంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతికొద్ది మందిలో మీరు ఉన్నారని ప్రశంసించారు.