8 నెలల క్రితమే అమెరికాకు బాపట్ల యువకుడు.. దుండగుడి కాల్పుల్లో మృతి

Bapatla Man Died In US Shooting
  • ఆర్కాన్సాస్‌లో ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న గోపీకృష్ణ
  • దుండగుడి కాల్పుల్లో తీవ్ర గాయాలు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి
  • యాజిలిలో విషాద ఛాయలు
అమెరికాలో కాల్పులకు మరో తెలుగు యువకుడు బలయ్యాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. 

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణ (32) 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆర్కాన్సాస్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. నిన్న మధ్యాహ్నం గోపి విధుల్లో ఉండగా తుపాకితో వచ్చిన దుండగుడు అతడిపై కాల్పులు జరిపాడు. అతడు కుప్పకూలడంతో దుండగుడు లోపలికి దూకి తనకు కావాల్సిన వస్తువులను తీసుకెళ్లిపోయాడు. అక్కడున్న సీసీటీవీల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

తీవ్రంగా గాయపడిన గోపీని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. గోపీకృష్ణకు భార్య, కుమారుడు ఉన్నాడు. అతడి మృతి విషయం తెలిసి యాజలిలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Go Back to Shorts
Dasari Gopi Krishna
Bapatla
Yazali
America
Gun Shooting

More Telugu News