రామోజీరావు మృతిపై ప్రధాని మోదీ సంతాపం
- రామోజీరావు మృతి చాలా బాధాకరమన్న ప్రధాని
- భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన దార్శనికుడని కితాబు
- మీడియా, వినోద ప్రపంచంలో ఆయన చెరగని ముద్ర వేశారంటూ వ్యాఖ్య
రామోజీరావు భారతదేశ అభివృద్ధి పట్ల ఎంతో మక్కువ చూపేవారు. పలు సందర్భాల్లో ఆయనతో మాట్లాడి కొంత జ్ఞానం పొందే అవకాశం లభించడం నా అదృష్టం. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.