మోదీ ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు... రెండో వారంలో ప్రమాణ స్వీకారం ఉండొచ్చు: కిషన్ రెడ్డి
- భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో బీజేపీ విజయం సాధించబోతోందన్న కిషన్ రెడ్డి
- బీజేపీకి డబుల్ డిజిట్ స్థానాలు ఖాయమన్న కిషన్ రెడ్డి
- ఎగ్జిట్ పోల్స్ను మోదీ పోల్స్ అన్న రాహుల్ గాంధీకి చురక
పూర్తి ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరగాలని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని తాను భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నానన్నారు. ఆ దిశగానే బీజేపీకి అత్యధిక స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ను మోదీ పోల్స్ అన్న రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి చురక అంటించారు. 'ఇంకా నయం.. రీఎగ్జిట్ పోల్స్ చేయాలని డిమాండ్ చేయలేదు' అని ఎద్దేవా చేశారు.