Daggubati Purandeswari: రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు వినతి పత్రం అందజేసిన పురందేశ్వరి

Purandeswari met Governor at Rajbhavan
షార్ట్స్‌లో చూడండి
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నేడు విజయవాడలో రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు ప్రకటించాలని కోరుతూ గవర్నర్ కు వినతి పత్రం అందించారు. 

ఆర్బీఐ జాబితాలో పేర్కొన్న ప్రకారం ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అప్పులు, ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు, కార్పొరేషన్ల ద్వారా తీసుకువచ్చిన అప్పులు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు, చెల్లించిన బిల్లులు... ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన అప్పుల వివరాలు, ప్రభుత్వ ఉద్యోగులకు టీఏ, డీఏ బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న కేసులు... తదితర వివరాలు అందించేలా రాష్ట్ర సీఎస్ కు నిర్దేశించాలని పురందేశ్వరి గవర్నర్ ను కోరారు. 

పురందేశ్వరితో పాటు ఇతర బీజేపీ నేతలు సాధినేని యామినీ చౌదరి, కాపు రామచంద్రారెడ్డి, పాతూరి నాగభూషణం, బిట్ర శివన్నారాయణ కూడా గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు.
Go Back to Shorts
Daggubati Purandeswari
Governor
Rajbhavan
Vijayawada
BJP
Andhra Pradesh

More Telugu News