ఐపీఎల్ ఫైనల్స్.. హైదరాబాద్లో జోరుగా బెట్టింగులు!
- హైదరాబాద్కు మకాం మార్చిన దేశంలోని ప్రధాన బుకీలు
- ప్రముఖ హోటళ్లు, రిసార్టుల్లో ఉంటూ వాట్సాప్ గ్రూపుల్లో భారీగా బెట్టింగులు
- ఆన్ లైన్ లావాదేవీలతో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్న లావాదేవీలు
- నగరంలో దాదాపు రూ.500 కోట్ల వరకూ బెట్టింగ్ సొమ్ము చేతులు మారొచ్చని అంచనా
నగరంలో ఐపీఎల్ సీజన్ లో రూ. 500 కోట్ల మేర పందెం సొమ్ములు చేతులు మారుతున్నా కేవలం 5-10 శాతం మాత్రమే పోలీసులకు చిక్కుతున్నాయి. ఆన్ లైన్ ద్వారా పందేలు జరుగుతుండటంతో నిఘా వర్గాలు గుర్తించలేకపోతున్నాయి. స్మార్ట్ ఫోన్, లోన్ యాప్ లతో అప్పులు, రెట్టింపు లాభాలంటూ యువకులకు వల వేస్తున్నారు. నగరంలో ఎందరో యువకులు, ఉద్యోగులు పందేలకు బానిసలుగా మారారు. కొందరు అప్పులు తీర్చలేక బలవన్మరణానికి కూడా పాల్పడ్డారు.