ఏపీలో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు.. ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ చంద్ర‌బాబు!

ఏపీలో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు.. ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ చంద్ర‌బాబు!

TDP President Nara Chandrababu Naidu Criticizes AP Police
  • ఏపీలో పోలింగ్ ప్ర‌శాంతంగా నిర్వ‌హించ‌డంలో పోలీసులు విఫ‌ల‌మ‌య్యార‌ని మండిపాటు
  • ప‌ల్నాడు జిల్లాతో పాటు రాష్ట్రంలో ప‌లు చోట్ల చోటుచేసుకుంటున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై ఆందోళ‌న 
  • ఈసీ వెంట‌నే పోలింగ్‌ను స‌మీక్షించి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల‌ని చంద్ర‌బాబు డిమాండ్‌
ఏపీలో పోలింగ్ ప్ర‌శాంతంగా నిర్వ‌హించ‌డంలో పోలీసులు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మండిప‌డ్డారు. ప‌ల్నాడు జిల్లాతో పాటు రాష్ట్రంలో ప‌లు చోట్ల చోటుచేసుకుంటున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మాచ‌ర్ల‌లో ఇప్ప‌టికీ దాడులు జ‌ర‌గ‌డం పోలీసుల వైఫ‌ల్య‌మేన‌ని దుయ్య‌బ‌ట్టారు. శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌లేక‌పోయార‌ని ఫైర్ అయ్యారు. ఈసీ వెంట‌నే పోలింగ్‌ను స‌మీక్షించి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల‌ని చంద్ర‌బాబు కోరారు. 
Advertisement
Chandrababu
Andhra Pradesh
TDP
AP Police
AP Politics

More Telugu News