రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్, బీఆర్ ఎస్ ల దుష్ప్రచారాన్ని ప్రజలే తిప్పికొడతారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- రిజర్వేషన్లను రద్దు చేయదనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించారన్న కిషన్ రెడ్డి
- తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుకుంటుందని ధీమా
- ఎన్నికలు వస్తాయని తెలిసినా కాంగ్రెస్ ముందే ఎందుకు రైతుబంధు ఇవ్వలేకపోయిందని ప్రశ్న
ఇప్పటివరకు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు రాని విధంగా బీజేపీకి అత్యధిక స్థానాలను కట్టబెట్టాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి బీజేపీకి అత్యధిక స్థానాలను గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ ప్రధానిగా ఉంటే మన దేశం జోలికి ఎవ్వరూ రాలేరని కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ హవా ఉందన్నారు.