కర్ణాటక బీజేపీ ఎంపీ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
- గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస ప్రసాద్
- నాలుగు రోజులు బెంగళూరులోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స
- మార్చి 18న రాజకీయ జీవితం నుంచి రిటైర్మెంట్
శ్రీనివాస ప్రసాద్ మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాస ప్రసాద్ 1976లో జనతా పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1979లో కాంగ్రెస్లో చేరారు. బీజేపీలో చేరడానికి ముందు జేడీఎస్, జేడీయూ, సమతా పార్టీలోనూ పనిచేశారు. 2017లో నంజన్గుడ్కు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో చామరాజనగర్ నుంచి లోక్సభకు పోటీచేసి విజయం సాధించారు.