Chandrababu: పూర్తిగా మహిళల కోసమే ఈ సభ ఏర్పాటు చేశాం: చంద్రబాబు

Chandrababu tweets on Mahila Shakti rally in Srikakulam
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం నియోజక వర్గం మహిళలతో మహిళా శక్తి సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన మహిళా సాధికారత, గతంలో తాము మహిళల కోసం ఏం చేశాము, వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం చేస్తాము అనే అంశాలను వివరించారు. ఈ సభపై చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. 

"నేడు శ్రీకాకుళంలో 'మహిళా శక్తి'తో ముఖాముఖి మాట్లాడాను. ఈ సభ ప్రత్యేకత ఏంటో తెలుసా...? ఈ సభకు పూర్తిగా మహిళలే హాజరయ్యేలా, మహిళల కోసమే ఏర్పాటు చేశాం. మహిళలకు అవకాశాలు ఇస్తే రాణిస్తారని నేను గట్టిగా నమ్ముతాను. రాజకీయ ప్రక్రియల్లో మహిళల ప్రాతినిధ్యం పెంపొందించడంపై రాజకీయ పార్టీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. వారి సమస్యలు పంచుకునేందుకు, వారి అవసరాలపై భరోసా ఇచ్చేందుకు అవకాశం కల్పించాలి" అని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu
Mahila Shakti
Women
TDP
Andhra Pradesh

More Telugu News