తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితే.. ఏపీలో వైసీపీకి వస్తుంది: గంటా శ్రీనివాసరావు
- అన్ని జిల్లాల్లో వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరుతున్నారన్న గంటా
- రాజకీయాల్లో తనది ఒక ప్రత్యేక శైలి అని వ్యాఖ్య
- జగన్ శైలి వైసీపీ నేతలకు కూడా నచ్చడం లేదని విమర్శ
రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఉందని చెప్పారు. వైసీపీ నేతలను తాను బెదిరిస్తున్నానని అవంతి శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తే పార్టీ మారుతారనేది ఒక భ్రమ అని చెప్పారు. అలాంటి పనులు వైసీపీనే చేస్తుందని అన్నారు. జగన్ వ్యవహారశైలి నచ్చక రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలో చేరారని తెలిపారు.