TDP-JanaSena-BJP Alliance: కృష్ణా జిల్లాలో బుధవారం నాడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారం... షెడ్యూల్ ఇదిగో!

Chandrababu and Pawan Kalyan will attend poll rallies in Krishna district tomorrow

  • బుధవారం నాడు రెండు సభల్లో పాల్గొననున్న చంద్రబాబు, పవన్
  • మధ్యాహ్నం 3 గంటలకు పెడనలో ప్రజాగళం సభ
  • రాత్రి 7 గంటలకు మచిలీపట్నంలో వారాహి విజయభేరి సభ


టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ రేపు (ఏప్రిల్ 17) కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో వారు ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పెడనలో ప్రజాగళం సభ జరగనుంది. స్థానిక బస్టాండ్ సెంటర్ లో ఈ సభ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు మచిలీపట్నం కోనేరు సెంటర్ లో వారాహి విజయభేరి సభ జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది.

  • Loading...

More Telugu News