బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారు: పొన్నం ప్రభాకర్
- తెలంగాణ ఏర్పాటును ప్రధాని నరేంద్రమోదీ అవమానించారన్న మంత్రి
- బీజేపీ భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తోందని ఆరోపణ
- బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం
కేంద్రం తెచ్చిన నల్ల సాగుచట్టాలు రైతుల ఆత్మ హత్యలకు కారణమయ్యాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. చేనేతలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు.