రాజీనామా చేసి టీడీపీలో చేరిన 40 మంది వాలంటీర్లు
- నెల్లూరు జిల్లాలో వాలంటీర్ల రాజీనామా
- టీడీపీ నేత వేమిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిక
- చంద్రబాబుపై నమ్మకంతోనే టీడీపీలో చేరామన్న వాలంటీర్లు
తాజాగా సీన్ రివర్స్ అయింది. భారీ సంఖ్యలో వాలంటీర్లు టీడీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడువలూరు మండలంలో 40 మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వీరంతా టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రబాబుపై నమ్మకంతోనే టీడీపీలో చేరామని వారు చెప్పారు.