తీహార్ జైలు నుంచి మరో సందేశం ఇచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
- రాజ్యాంగ రక్షణకు తాను సిద్ధమన్న ఢిల్లీ సీఎం
- నియంతృత్వ ప్రభుత్వమంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపాటు
- అన్ని అవరోధాలు, దౌర్జన్యాలను ఎదుర్కుంటానంటూ భార్య సునీతకు చెప్పిన కేజ్రీవాల్
రాజ్యాంగాన్ని రక్షించడమే నేడు అత్యంత ముఖ్యమైన విషయమంటూ కేజ్రీవాల్ చెప్పారని, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాడు ‘సంవిధాన్ బచావో.. తనషాహీ హఠావో’ దినంగా పాటించాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారని రాయ్ పేర్కొన్నారు. కేజ్రీవాల్ నివాసంలో ఆయన భార్య సునీతా కేజ్రీవాల్తో పార్టీ నాయకత్వం భేటీ అయిన అనంతరం మంత్రి రాయ్ ఈ ప్రకటన చేశారు.
కాగా తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ను మంగళవారం ఆయన భార్య సునీత, వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ కలిశారు. ఏప్రిల్ 15 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగించిన తర్వాత తొలిసారి వారు కేజ్రీవాల్ను మంగళవారం కలిశారు.