జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ప్రారంభం
- ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర
- 21 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర
- ఈ రాత్రికి ఆళ్లగడ్డలో బస చేయనున్న జగన్
ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఈరోజు కడప జిల్లాలో బస్సుయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో నిర్వహించే బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు. రాత్రికి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు సీఎం చేరుకుంటారు. ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన శిబిరంలో రాత్రికి జగన్ బస చేస్తారు.