క్రిమిసంహారక మందు తాగి తమిళనాడు ఎంపీ ఆసుపత్రి పాలు
- ఈరోడ్ (తమిళనాడు) ఎంపీ, ఎమ్డీఎమ్కే నేత ఎ. గణేశమూర్తి ఆసుపత్రిలో చేరిక
- క్రిమిసంహారక మందు తాగినట్టు కుటుంబసభ్యులకు చెప్పడంతో ఆసుపత్రికి తరలింపు
- ఎంపీ ఆరోగ్యం విషమంగా ఉందన్న ఎమ్డీఎమ్కే నేత దురై వైకో
- పార్టీ టికెట్ రాకపోవడంతో ఆత్మహత్యా యత్నం చేసిన మూర్తి
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎ.గణేశమూర్తిని ఎమ్డీఎమ్కే నేత దురై వైకో పరామర్శించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు ఎక్మో ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్, హౌసింగ్, ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి ఎస్, ముత్తుస్వామి, మొదకురచి బీజేపీ ఎమ్మెల్యే డా.సి.సరస్వతి, ఏఐఏడీఎమ్కేకు చెందిన కె.వి.రామలింగం కూడా ఆసుపత్రికి వెళ్లి గణేశమూర్తి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.