కేసీఆర్ నివాసానికి ఫ్రీగా వాటర్ ట్యాంకర్ పంపిన జలమండలి
- నీటి కొరత నేపథ్యంలో జలమండలి ఆఫీసుకు ఫోన్
- వెంటనే 5 వేల లీటర్ల ట్యాంకర్ పంపిన అధికారులు
- పెద్ద సంఖ్యలో నేతలు ఇంటికి రావడంతో నీటి కొరత
ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో సోమవారం నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వచ్చారు. దీంతో ఇంట్లో నీటికి కొరత ఏర్పడిందని కేసీఆర్ ఇంటి వ్యవహారాలు చూసే సిబ్బంది చెప్పారు. దీంతో జలమండలి తట్టిఖాన సెక్షన్ కార్యాలయానికి ఫోన్ చేసి మంచినీరు కావాలని కోరినట్లు తెలిపారు. కాగా, కేసీఆర్ ఇంటికి వాటర్ ట్యాంకర్ వెళ్లిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.