నేడు ఏపీకి వస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. భారీగా ఫ్లెక్సీల ఏర్పాటు
- నేడు విశాఖలో కాంగ్రెస్ పార్టీ న్యాయసాధన సభ
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభ
- సాయంత్రం 4 గంటలకు సభ
ఈ సాయంత్రం విశాఖలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు రేవంత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. ఈ సభకు 'న్యాయసాధన సభ' అని పేరు పెట్టారు. ఈ సభకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ మాణికం ఠాగూర్, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, పల్లంరాజు, జేడీ శీలం, కేవీపీ రామచంద్రరావు తదితర కీలక నేతలు హాజరుకానున్నారు. ఈ సభకు దాదాపు 70 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం రెండు వేల మందిని తీసుకురావలని నిర్ణయించారు. రేవంత్ రానున్న నేపథ్యంలో, ఆయన ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు.