నేడు కశ్మీర్కు ప్రధాని మోదీ.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలి పర్యటన.. భారీ బందోబస్తు
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- 'వికసిత్ భారత్.. వికసిత్ జమ్మూకశ్మీర్' కార్యక్రమానికి హాజరు
- రూ.1400కోట్ల పర్యాటక ప్రాజెక్టుల ప్రారంభం
- 2వేల రైతు సేవా కేంద్రాల ఏర్పాటు
శ్రీనగర్లోని బక్షి మైదానంలో జరగనున్న 'వికసిత్ భారత్.. వికసిత్ జమ్మూకశ్మీర్' కార్యక్రమానికి హాజరవుతారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం సుమారు రూ.5వేల కోట్ల విలువైన కార్యక్రమాలను ప్రధాని ప్రారంభిస్తారు. దీంతో పాటు శ్రీనగర్లోని హజ్రత్ మందిరంలో స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల కింద రూ.1400కోట్ల వరకు పర్యాటక రంగానికి చెందిన ప్రాజెక్టులను ప్రారంభిస్తారని సమాచారం. అంతేగాక ఇటీవల కొత్తగా కొలువులు సాధించిన దాదాపు 1000 మందికి మోదీ అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వనున్నారు. అలాగే 2వేల రైతు సేవా కేంద్రాలను ఏర్పాటుచేస్తారని బీజేపీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.