ఏప్రిల్ మొదటి వారంలో లోక్ సభ ఎన్నికలు: కిషన్ రెడ్డి
- తొమిదిన్నరేళ్ల పాటు మోదీ అద్భుత పాలన కొనసాగిందన్న కిషన్ రెడ్డి
- ప్రపంచ దేశాలు భారత్ ను పొగిడేలా మోదీ చేశారని వ్యాఖ్య
- మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని కితాబు
మోదీ ప్రధాని అయిన తర్వాత దేశం చాలా ప్రశాంతంగా మారిందని... ప్రపంచ దేశాలు సైతం భారత్ ను పొగిడేలా మోదీ చేశారని కిషన్ రెడ్డి కొనియాడారు. అన్ని సర్వేలలో మోదీనే బెస్ట్ నేతగా ఉన్నారని చెప్పారు. దేశంలో ప్రతి మహిళకు వంట గ్యాస్ అందించిన ఘనత మోదీదని అన్నారు. అందరి కడుపు నింపడానికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారని చెప్పారు. మరో ఐదేళ్ల పాటు ఉచిత బియ్యాన్ని పంపిణీ పంపిణీ చేయనున్నారని తెలిపారు.
2జీ, బొగ్గు కుంభకోణాల్లో రూ. 12 లక్షల కోట్లను కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేసిందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ దోపిడీని భరించలేక, అవినీతి రహిత పాలకుడు కావాలని మోదీని ప్రజలు ఎన్నుకున్నారని చెప్పారు. మోదీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని తెలిపారు. ఈ ఎన్నికల్లో మోదీని మరోసారి ఆశీర్వదిద్దామని చెప్పారు.