బీఆర్ఎస్ కు వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి రాజీనామా.. త్వరలో కాంగ్రెస్లోకి!
- పదవీకాలంలో సహకరించిన పార్టీకి, నాయకులకు ధన్యవాదాలు తెలిపిన సునిత
- కాంగ్రెస్లో చేరనున్న జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య
- వీరి బాటలోనే హస్తం గూటికి మరికొందరు నాయకులు?
కాంగ్రెస్ పార్టీలోకి మరికొందరు బీఆర్ఎస్ నాయకులు
జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి దంపతులు, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితా రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.