Mosquito Tornado: పూణె వాసులకు కొత్తముప్పు.. భయపెడుతున్న ‘దోమల సుడిగాలి’.. వీడియో ఇదిగో!

  • ముఠానది మీదుగా లక్షలాది దోమల గుంపులు
  • నిద్రలేని రాత్రులు గడుపుతున్న పలు ప్రాంతాల ప్రజలు
  • తలుపులు కూడా తెరవడానికి భయపడుతున్న స్థానికులు
  • ఖరాడీలోని ములా-ముఠా నది నీటిమట్టం పెరగడమే కారణం!
Mosquito Tornado Sweeps Through Residential Areas In Pune

‘మస్కిటో టోర్నడో’ పూణె వాసులను హడలెత్తిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. నగరంలోని ముఠానది మీదుగా కోట్లాది దోమలు సుడిగాలిలా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా ముంధ్వా, కేశవ్‌నగర్, ఖారడీ ప్రాంతాల్లో ఇవి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. 

దోమల సుడిగాలితో అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రాంతాల్లోని విలాసవంతమైన హై రైజ్ భవనాల్లో నివసిస్తున్నవారు బాల్కనీ డోర్లు తెరిచేందుకు కూడా భయపడుతున్నారు. చిన్నారులు వెళ్లకుండా పార్కులు, గార్డెన్లు మూసివేశారు. ఈ దోమల సుడిగాలిపై చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలను శుభ్రం చేయాలని కోరుతున్నారు. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా లాంటి జబ్బుల బారినపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఖరాడీలోని ములా-ముఠా నదిలోని నీటిమట్టం పెరగడమే దోమల సుడిగాలికి కారణమని తెలుస్తోంది. పూణె మునిసిపల్ కార్పొరేషన్ రెండు రోజులక్రితం అదనపు నీటిని తొలగించే పని ప్రారంభించినప్పటికీ పరిస్థితిలో మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు.

ముఖ్యంగా, ఖరాడిలోని ములా-ముఠా నదిలో నీటి మట్టం పెరగడం వల్ల ఈ ముప్పు ఏర్పడింది. పూణె మునిసిపల్ కార్పొరేషన్ రెండు రోజుల క్రితం అదనపు నీటిని తొలగించే పనిని ప్రారంభించినప్పటికీ, పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ఆకాశహర్మ్యాలు, IT పార్క్ ప్రాంగణాలు, పాఠశాలలు, క్రీడా స్టేడియాలు, వృద్ధాశ్రమాలు, శ్మశానవాటికలు మరియు స్థానిక గ్రామాలతో సహా వివిధ స్థాపనలను ప్రభావితం చేసే నదీగర్భంలో పరిస్థితి ముఖ్యంగా భయంకరంగా ఉంది. నదీ తీర ప్రాంతంలో ఉన్న ఆకాశహర్మ్యాలు, ఐటీ పార్క్ ప్రాంగణాలు, స్కూళ్లు, స్టేడియంలు, ఓల్డేజ్ హోంలు, శ్మశానవాటికల్లో దోమల సుడిగాలి ప్రభావం ఎక్కువ ఉంది. గతంలో ఇలాంటి మస్కిటో టోర్నడోలు మధ్య అమెరికా, రష్యాలలో వర్షాకాలంలో కనిపించేవి.

More Telugu News