Men shot dead In Saloon: కటింగ్ షాపులో కాల్పులు.. ఇద్దరు కస్టమర్ల మృతి!

  • న్యూఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలోని హెయిర్ కటింగ్ సెలూన్‌లో ఘటన
  • ఇద్దరు వ్యక్తులపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తలపై పలుమార్లు కాల్పులు
  • వదిలిపెట్టమని బాధితులు వేడుకున్నా కనికరించని వైనం
  • నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాల గాలింపు
On Camera 2 Men Shot Dead Inside Delhi Salon

తమను చంపొద్దంటూ ఆ ఇద్దరు చేతులెత్తి మరీ వేడుకున్నారు. కనికరించమని కాళ్లావేళ్లా పడ్డారు. అయినా, నిందితులు కనికరించలేదు. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఇద్దరినీ తలపై కాల్చి హత్య చేశారు. ఢిల్లీలోని నజాఫ్‌గడ్ ప్రాంతంలోగల ఓ హెయిర్ కటింగ్ సెలూన్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డయ్యాయి. 

షాపులో అందరూ చూస్తుండగానే దుండగులు ఆ ఇద్దరినీ కాల్చి చంపారని స్థానిక పోలీసులు తెలిపారు. మృతులను సోసూ, ఆశిష్‌గా గుర్తించారు. వారికి నిందితులతో వ్యక్తిగత వైరం ఏదైనా ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. గ్యాంగ్‌వార్‌లో భాగంగా ఈ ఘటన జరిగి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా, నిందితుల ఆచూకీ కనుక్కునేందుకు మూడు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

  • Loading...

More Telugu News