కటింగ్ షాపులో కాల్పులు.. ఇద్దరు కస్టమర్ల మృతి!

On Camera 2 Men Shot Dead Inside Delhi Salon
  • న్యూఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలోని హెయిర్ కటింగ్ సెలూన్‌లో ఘటన
  • ఇద్దరు వ్యక్తులపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తలపై పలుమార్లు కాల్పులు
  • వదిలిపెట్టమని బాధితులు వేడుకున్నా కనికరించని వైనం
  • నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాల గాలింపు
తమను చంపొద్దంటూ ఆ ఇద్దరు చేతులెత్తి మరీ వేడుకున్నారు. కనికరించమని కాళ్లావేళ్లా పడ్డారు. అయినా, నిందితులు కనికరించలేదు. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఇద్దరినీ తలపై కాల్చి హత్య చేశారు. ఢిల్లీలోని నజాఫ్‌గడ్ ప్రాంతంలోగల ఓ హెయిర్ కటింగ్ సెలూన్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డయ్యాయి. 

షాపులో అందరూ చూస్తుండగానే దుండగులు ఆ ఇద్దరినీ కాల్చి చంపారని స్థానిక పోలీసులు తెలిపారు. మృతులను సోసూ, ఆశిష్‌గా గుర్తించారు. వారికి నిందితులతో వ్యక్తిగత వైరం ఏదైనా ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. గ్యాంగ్‌వార్‌లో భాగంగా ఈ ఘటన జరిగి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా, నిందితుల ఆచూకీ కనుక్కునేందుకు మూడు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
Go Back to Shorts
Men shot dead In Saloon
New Delhi
Crime News

More Telugu News