రాష్ట్ర గీతంగా ‘జయజయహే తెలంగాణ’: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
- దళిత బిడ్డ అందెశ్రీకి ఉద్యమ గొప్పదనం దక్కకూడదనే ఆలోచనతో ‘జయజయహే తెలంగాణ’ గేయాన్ని దాదాపు నిషేధించారంటూ బీఆర్ఎస్పై ఆరోపణ
- తెలంగాణ తల్లి, తెలంగాణ అధికారిక చిహ్నాలను కూడా మార్చుతామని వెల్లడి
- రాచరికపు ఆనవాళ్లు ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ విధానమన్న రేవంత్ రెడ్డి
మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహం సగటు తెలంగాణ బిడ్డలా లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే విగ్రహం ఓ తల్లిలా ఉంటుందని సీఎం రేవంత్ ప్రకటించారు. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని కూడా మార్చుతామని వెల్లడించారు. రాచరికపు ఆనవాళ్లు ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ విధానమని ఆయన పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం ప్రతిపక్ష బీఆర్ఎస్కు నచ్చడంలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర గేయం, చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు విషయంలో తమకు ఎలాంటి ఆశలు, ఆశయాలు లేవన్నారు. ఈ విషయంలో ఏవైనా సూచనలు, సలహాలు ఉంటే చెప్పాలని స్పీకర్కి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.