AP TET: ఏపీలో ఎల్లుండి టెట్, డీఎస్సీ నోటిఫికేషన్

  • 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం
  • అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • 12 సంవత్సరాల క్రితం తొలగించిన అప్రెంటిస్‌షిప్ విధానం మళ్లీ తెరపైకి
AP Govt to release notification for TET and DSC on 5th

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లుండి (5న) టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభం అవుతుంది. ఈ రెండింటికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. డీఎస్సీలో మొత్తం 6,100 పోస్టులు భర్తీ చేస్తారు. అలాగే, పుష్కరకాలం క్రితం తొలగించిన అప్రెంటిస్‌షిప్ విధానాన్ని మళ్లీ తీసుకొస్తున్నారు. 

ఇందులో భాగంగా డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్లపాటు గౌరవ వేతనానికి పనిచేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అప్రెంటిస్‌షిప్ సమయాన్ని కూడా ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది.

More Telugu News