ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ కోదండరాం
- సచివాలయంలో సీఎంను కలిసిన కోదండరాం, అమీర్ అలీఖాన్
- గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వీరిని ప్రకటిస్తూ మధ్యాహ్నం ఉత్తర్వులు
- తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కోదండరాం
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. కానీ అర్హతలు లేవంటూ గవర్నర్ తిరస్కరించారు. దీంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం, అమీర్ అలీఖాన్ల పేర్లను పంపించింది. గవర్నర్ ఈ ఫైలుపై సంతకం చేశారు.