రాజీనామా లేఖలను సీఎం జగన్, లోక్ సభ స్పీకర్ కు పంపాను: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
- వైసీపీలో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు స్థానచలనం
- కొనసాగుతున్న రాజీనామాలు
- నిన్న పార్టీకి, ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా
తన రాజీనామాపై నేడు ఆయన ట్విట్టర్ లో అప్ డేట్ ఇచ్చారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేశానని, దానికి సంబంధించిన రాజీనామా లేఖను వైసీపీ అధినేత, సీఎం జగన్ కు పంపానని వెల్లడించారు.
అదే సమయంలో ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశానని, దానికి సంబంధించిన రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు పంపానని తెలిపారు. తన రాజీనామాను 2024 జనవరి 23 నుంచి ఆమోదించాలని కోరానని లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు.
