WhatsApp: త్వరలోనే కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్.. ఇక ఈజీగా ఫైల్ షేరింగ్

WhatsApp will bring a new update soon and Users can easyly file sharing
ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త ఫీచర్లను అందిస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ త్వరలోనే మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. వాట్సాప్‌పై ఫైల్-షేరింగ్ ఫీచర్‌ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే సమీపంలోని వ్యక్తులతో సులభంగా ఫైల్స్‌ను షేర్ చేసుకోవచ్చు. యూజర్లు ఫైల్స్‌ను స్వీకరించవచ్చు లేదా పంపించవచ్చు. ఇందుకోసం 'పీపుల్ నియర్‌బై' అనే ఫీచర్ అందుబాటులోకి వస్తోందని, సమీపంలోని వ్యక్తులు సురక్షితంగా ఫైల్స్‌ను షేర్ చేసుకోవచ్చని ‘వాబెటాఇన్ఫో’ రిపోర్ట్ పేర్కొంది. ఈ ప్రక్రియలో ఫైల్స్ పంపేవారు, స్వీకరించే వారూ కూడా 'పీపుల్ నియర్ బై' సెక్షన్ ను ఓపెన్ చేయాల్సి వుంటుంది. 

షేర్ రిక్వెస్ట్‌ను పొందడానికి, ఫైల్ మార్పిడి విషయంలో డివైజ్‌ని కదిలించాల్సి (షేక్) ఉంటుందని రిపోర్ట్ పేర్కొంది. ఈ ఫీచర్ ద్వారా ఫైల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయని, వాట్సాప్ చాట్‌కు వెలుపలకు, తెలియని ఇతర నెట్‌వర్క్‌లకు ఫైల్స్‌ పంపించినా సురక్షితంగా ఉంటాయని వెల్లడించింది. సమీపంలోని వ్యక్తులతో ఫైల్‌లను త్వరగా షేర్ చేయడానికి ఈ ఫీచర్ చాలా సులభంగా ఉంటుందని, వేగంగా, నేరుగా షేర్ చేసేందుకు ఇది అనువుగా ఉంటుందని వివరించింది. 

ప్రతి ఫైల్ మార్పిడిలో గోప్యత, భద్రత ఉంటుందని, కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వ్యక్తులకు షేర్ చేసినప్పుడు ఫోన్ నంబర్లు కనిపించవని రిపోర్ట్ తెలిపింది. అయితే ఈ ఫీచర్ ను ప్రస్తుతం డెవలప్‌ చేస్తున్నారని, భవిష్యత్‌లో తీసుకువచ్చే అప్ డేట్ ద్వారా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుందని తెలిపింది.

మరోవైపు వాట్సాప్ ఐవోఎస్ యూజర్లు స్టిక్కర్లను క్రియేట్ చేయడానికి, వాటిని సవరించడానికి అవకాశం కల్పించే కొత్త ఫీచర్‌ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫోటోలను స్టిక్కర్‌లుగా మార్చుకునే వీలుంది. ఇప్పటికే ఉన్న స్టిక్కర్‌లను కూడా నచ్చిన విధంగా సవరించుకోవచ్చు.
WhatsApp
new update
People nearby
file sharing

More Telugu News