Nara Lokesh: నారా లోకేశ్ ను కలిసిన కేశినేని నాని అనుచరుడు బొమ్మసాని

  • సీఎం జగన్ ను కలిసిన కేశినేని నాని
  • త్వరలో వైసీపీలో చేరతానని ప్రకటన
  • తాము టీడీపీని వదిలి రాబోమని నానికి చెప్పిన  బొమ్మసాని
  • తాము టీడీపీలోనే ఉంటామని లోకేశ్ కు స్పష్టీకరణ 
Kesineni Nani aide Bommasani Subbarao met Nara Lokesh

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇవాళ సీఎం జగన్ ను కలవడం, తాను వైసీపీలో చేరతానని ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 

ఎంపీ కేశినేని నాని అనుచరుడు బొమ్మసాని సుబ్బారావు ఈ సాయంత్రం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. తాము టీడీపీలోనే ఉంటామని లోకేశ్ కు స్పష్టం చేశారు. టీడీపీని వదిలి వచ్చేది లేదని తాము కేశినేని నానితో చెప్పిన విషయాన్ని కూడా బొమ్మసాని... లోకేశ్ కు వివరించారు. జగన్ ఇంటి గడప తొక్కిన కేశినేని నానితో ఇక కలిసేదే లేదని తేల్చి చెప్పారు. 

బొమ్మసాని ప్రస్తుతం విజయవాడ పార్లమెంటు స్థానం టీడీపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

More Telugu News