guntur karam: 'గుంటూరు కారం' బెనిఫిట్ షోలకు ఓకే: మహేశ్ బాబు అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు

  • ఈ నెల 12 నుంచి 23 చోట్ల అర్ధరాత్రి ఒంటిగంట షోలకు పచ్చజెండా
  • 12 నుంచి 18వ తేదీ వరకు ఉదయం 4 గంటలకు ప్రదర్శన
  • టిక్కెట్ ధర పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
Telangana Government permission to guntur karam movies benefit show

సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు తీపి కబురు! గుంటూరు కారం సినిమా బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట నుంచి... 23 చోట్ల షోలకు పచ్చజెండా ఊపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉదయం 4 గంటల షోలను ప్రదర్శిస్తారు. థియేటర్‌లలో ఈ సినిమా ఆరో షోకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

అలాగే సినిమా టిక్కెట్ ధర పెంపునకు కూడా ఓకే చెప్పింది. సింగిల్ స్క్రీన్‌లలో రూ.65, మల్టీప్లెక్స్ థియేటర్‌లలో రూ.100 పెంపునకు అనుమతిచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. బెనిఫిట్ షోలు కేవలం మొదటి వారానికి మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది. మహేశ్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం చిత్రం ఈ నెల 12వ తేదీన విడుదలవుతోంది. ఈ సినిమా కోసం మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

More Telugu News