2019లో నేను ఓడిపోవడానికి బీఆర్ఎస్ నేతల వైఖరే కారణం: కల్వకుంట్ల కవిత
- కేసీఆర్ నిజామాబాద్ కు వచ్చినప్పుడు కార్యకర్తలను స్థానిక నేతలు కలవనీయలేదన్న కవిత
- తాను పర్యటించినప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని వ్యాఖ్య
- తనను ఎరైనా కలవొచ్చన్న కవిత
తాజాగా, నిజామాబాద్ బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో కవిత మాట్లాడుతూ... 2019లో తాను ఓటమిపాలు కావడానికి సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల వైఖరే కారణమని ఆమె అన్నారు. ఆ సమయంలో నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటించిన సమయంలో ఆయనను కార్యకర్తలు కలవకుండా స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డంకులు సృష్టించారని చెప్పారు. తాను జిల్లాలో పర్యటించినప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ విషయమై తనకు ఫిర్యాదులు కూడా అందాయని చెప్పారు. తాను నిజామాబాద్ లోనే ఉంటానని... ఎవరైనా తనను కలవొచ్చని అన్నారు. అందరూ కూడా పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని సూచించారు.