ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్
- ప్రతి ఏడాది మాదిరిగానే ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహణ
- ప్రకటించిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ
- సోమవారం సమావేశమై నిర్ణయించిన కార్యవర్గ సభ్యులు
ఈ సమావేశంలో కోశాధికారి పి.రాజేశ్వరరావు, మాజీ కార్యదర్శి శృతికాంత్ భారతి, ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, కోయ చంద్రమోహన్, సహయ కార్యదర్శి శోభన్ బాబు, జనార్దన్ గుప్తా, కవి యాకూబ్, శ్రీకాంత్, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమిటీ కొత్త సెక్రటరీగా ఆర్.వాసు బాధ్యతలు స్వీకరించారు. పుస్తక ప్రియులు, పాఠకులు ఈ ఏడాది బుక్ ఫెయిర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యవర్గ సభ్యులు కోరారు.