త్వరలోకే కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారు: హరీశ్ రావు
- కేసీఆర్ కోలుకుంటున్నారన్న హరీశ్ రావు
- వచ్చే నెలలో తెలంగాణ భవన్ లో ప్రతి రోజు కార్యకర్తలను కలుస్తారని వెల్లడి
- కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది లోపే తిరుగుబాటు తప్పదని వ్యాఖ్య
బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపులకు దిగితే ఎమ్మెల్యేలంతా బాధితుల వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి స్పీడ్ బ్రేకర్ వంటిదని... ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ మన సత్తా ఏమిటో చూపిద్దామని అన్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసినప్పటికీ ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల ఓడిపోయామని చెప్పారు.