మేం ఎలాంటి అప్లికేషన్లు లేకుండా పథకాలను అందించాం: జగదీశ్ రెడ్డి
- ఇష్టారీతిన హామీలు ఇచ్చి ప్రజాపాలన పేరుతో తప్పించుకునే ప్రయత్నమని ఆరోపణ
- తాము దరఖాస్తు లేకుండా ఆన్ లైన్ ద్వారా అర్హులను ఎంపిక చేశామన్న జగదీశ్ రెడ్డి
- ఈ పత్రాల డ్రామాలు ఎంతో కాలం సాగవన్న మాజీ మంత్రి
దరఖాస్తులు లేకుండా... దళారి వ్యవస్థ లేకుండా తాము ఆన్ లైన్ విధానం ద్వారా అర్హులను ఎంపిక చేశామన్నారు. ఆరు గ్యారంటీల దరఖాస్తు ఫారాలు అసంబద్ధంగా ఉన్నాయని విమర్శించారు. ప్రజలు తమకు పథకాలు అడుగుతున్నారు కానీ.. పత్రాలు కాదని చురక అంటించారు. ఈ పత్రాల డ్రామాలు ఎంతోకాలం సాగవని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మోసాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారని... హామీలు అమలు చేయకుంటే అదే ప్రజలు మీ వెంటపడి తరుముతారని హెచ్చరించారు. కౌలు రైతులను పాసు పుస్తకాలు అడగడం ఏమిటన్నారు.