అర్జున అవార్డు రేసులో మహ్మద్ షమీ!

  • వరల్డ్ కప్ ప్రదర్శనతో నామినీల జాబితా చేరిక
  • షమీని నామినీగా పరిగణించాలంటూ బీసీసీఐ ప్రత్యేక అభ్యర్థన
  • బీసీసీఐ విజ్ఞప్తి మేరకు షమీని ఎంపిక చేసిన క్రీడా శాఖ
వరల్డ్ కప్ టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరిచిన భారత్ పేసర్ మహ్మద్ షమీ అర్జున అవార్డు నామినీగా ఎంపికయ్యాడు. ఈ మేరకు సెలక్షన్ కమిటీ అతడి పేరును సిఫార్సు చేసినట్టు సమాచారం. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు నామినీల జాబితాలో తొలుత షమీకి స్థానం దక్కకపోవడంతో బీసీసీఐ స్వయంగా రంగంలోకి దిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వరల్డ్ కప్‌లో షమీ ప్రదర్శన దృష్ట్యా అతడిని నామినీగా పరిగణించాలని క్రీడా శాఖకు బీసీసీఐ ప్రత్యేక విజ్ఞప్తి చేయడంతో షమీ అర్జున అవార్డు నామినీగా ఎంపికయ్యాడని తెలుస్తోంది. దేశంలో రెండో అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డు అన్న విషయం తెలిసిందే. 

వరల్డ్ కప్‌లో షమీ అసామాన్య ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. టోర్నీలో కేవలం 7 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టి అత్యధికంగా వికెట్లు తీసిన ఆటగాడిగా షమీ నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో షమీ కేవలం 18 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం యావత్ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. టోర్నీలో తొలి నాలుగు మ్యాచ్‌లకు అందుబాటులో లేని షమీ ఆ తరువాత తన అద్భుత ప్రదర్శనతో యావత్ టోర్నీలో స్టార్‌గా నిలిచాడు.

Mohammed Shami
Arjuna Award
BCCI
Cricket

More Telugu News