Telangana Assembly Election: పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం ఇవ్వలేదని ఉపాధ్యాయ సంఘాల పిటిషన్.. విచారణ ముగించిన హైకోర్టు

  • పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశమివ్వలేదని.. ఓటు వేసే హక్కును కోల్పోతున్నామని కోర్టులో పిటిషన్ 
  • దరఖాస్తు చేసుకున్న వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు తెలిపిన ఈసీ తరఫు న్యాయవాది
  • ఈసీ న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకొని విచారణను ముగిస్తున్నట్లు తెలిపిన హైకోర్టు
Teachers association petition in High Court

అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం ఇవ్వలేదని, దీంతో తాము ఓటు వేసే హక్కును కోల్పోతున్నామని ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌కు సంబంధించి హైకోర్టులో విచారణ ఈ రోజు ముగిసింది. ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు.. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే కనుక వారందరికీ ఆ మేరకు సౌకర్యం కల్పించామని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు లక్షా డెబ్బై ఐదు వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకొని విచారణను ముగిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

More Telugu News