Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

  • మధ్యప్రదేశ్ లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు
  • అన్ని స్థానాలకు నేడు ఒకే విడతలో పోలింగ్
  • ఉదయం 11 గంటల వరకు 27.62 శాతం పోలింగ్ నమోదు
  • ఛత్తీస్ గఢ్ లో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్
Polling in Madhya Pradesh

ఇవాళ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఒకే విడతలో పోలింగ్ జరుపుతున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి 27.62 పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ముగియనుంది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అటు, ఛత్తీస్ గఢ్ లో నేడు రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో ఈ నెల 7న తొలి విడతలో 20 స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగిలిన 70 స్థానాలకు నేడు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల సమయానికి 19.05 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

More Telugu News