ఏపీలో మళ్లీ తిరుగుతున్న చెడ్డీగ్యాంగ్.. వీడియో ఇదిగో!
- తిరుపతిలో తిరుగుతున్న ముఠా
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసుల హెచ్చరిక
- రాత్రివేళ కాలింగ్ బెల్ కొట్టినా, తలుపు తట్టినా స్పందించవద్దన్నపోలీసులు
రాష్ట్రంలో చెడ్డీగ్యాంగ్ మూడేళ్లుగా తిరుగుతోంది. 2021లో తిరుపతిలోని విద్యానగర్లో చోరీకి విఫలయత్నం చేసింది. గతేడాది తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన కాలనీలో గోడదూకి ఓ ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేసింది. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వీరు చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. వీరు సంచరిస్తుండగా రికార్డయిన సీసీ టీవీ ఫుటేజీని విడుదల చేసిన పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు.