Dum Masala: మహేశ్ బాబు 'గుంటూరు కారం' నుంచి ఫస్ట్ సింగిల్... ప్రోమో ఇదిగో!

  • మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం
  • తొలి సింగిల్ 'దమ్ మసాలా' విడుదలకు సన్నాహాలు
  • నవంబరు 7న పూర్తి లిరికల్ వీడియో విడుదల
Promo of Dum Masala song from Mahesh Babu Guntur Kaaram movie is out now

సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త చిత్రం 'గుంటూరు కారం' నుంచి తొలి పాట విడుదలకు రంగం సిద్ధమవుతోంది. 'దమ్ మసాలా' అనే ఈ మాస్ మసాలా గీతం ప్రోమోను చిత్రబృందం నేడు విడుదల చేసింది. పూర్తి లిరికల్ వీడియోను నవంబరు 7న విడుదల చేయనున్నారు. 

"దమ్ మసాలా బిర్యానీ... గుద్దిపారేయ్ గుంటూర్నీ" అంటూ ఎనర్జటిక్ గా సాగే ఈ గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రచించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న 'గుంటూరు కారం' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక్ అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు.

More Telugu News