భారత క్రికెట్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ కన్నుమూత
- 77 ఏళ్ల వయసులో కన్నుమూత
- 67 టెస్టుల్లో 266 వికెట్లు సాధించిన దిగ్గజం
- స్పిన్ బౌలింగ్ విప్లవానికి బాటలు వేసిన మాజీల్లో ఒకరిగా గుర్తింపు
వన్డేల్లో భారత్ సాధించిన మొట్టమొదటి విజయంలో ఎరపల్లి ప్రసన్న, బీఎస్ చంద్రశేఖర్, ఎస్.వెంకటరాఘవన్లతోపాటు బిషన్ సింగ్ బేడీ కీలక పాత్ర పోషించారు. 1975 వరల్డ్ కప్లో ఈస్ట్ ఆఫ్రికాపై మ్యాచ్లో బేడీ అద్భుతంగా రాణించారు. ఈస్ట్ ఆఫ్రికా 120 పరుగులు చేయగా అందులో బేడీ గణాంకాలు 12-8-6-1 నమోదు చేశారు. ఇక దేశవాళీ క్రికెట్ విషయానికి వస్తే బిషన్ బేడీ ఢిల్లీ జట్టుకు ఎక్కువగా ఆడారు. రిటైర్మెంట్ తర్వాత ప్రస్తుతం రాణిస్తున్న క్రికెటర్లలో చాలామంది ఆయన వద్ద కోచింగ్ తీసుకున్నారు. పలువురు క్రికెటర్లకు ఆయన మెంటార్గా వ్యవహరించారు. క్రికెట్ ఫీల్డ్కు దూరమయ్యాక వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా కూడా పనిచేశారు.